మహారాష్ట్రలో తగ్గుముఖం పట్టని కరోనా.. ఇవాళ కూడా..

ABN , First Publish Date - 2020-07-04T03:14:40+05:30 IST

మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం మాదిరిగానే..

మహారాష్ట్రలో తగ్గుముఖం పట్టని కరోనా.. ఇవాళ కూడా..

ముంబై: మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం మాదిరిగానే శుక్రవారం కూడా 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ మహారాష్ట్రలో కొత్తగా 6,364 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.


కొత్తగా నమోదైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,92,990కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 79,911 కాగా.. ఇప్పటివరకూ 1,04,687 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే.. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా మహారాష్ట్రలో అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. మహారాష్ట్రలో ఇవాళ కొత్తగా 198 మంది కరోనా వల్ల మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 8,376కు చేరింది.

Updated Date - 2020-07-04T03:14:40+05:30 IST