ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-19T00:19:09+05:30 IST

గడిచిన 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు చేశారు. అయితే ఇందులో 6,341 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.

ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు చేశారు. అయితే ఇందులో 6,341 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. కరోనాతో ఈ రోజు 57 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 18,39,243కు  కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 67,629 యాక్టివ్ కేసులున్నాయి.


మరోవైపు ఏపీలో కర్ఫ్యూ వేళలను సడలించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నేడు కొవిడ్‌పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జూన్‌ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సాయంత్రం 5 గంటల కల్లా దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుంది. 

Updated Date - 2021-06-19T00:19:09+05:30 IST