634 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-18T16:47:16+05:30 IST
రాష్ట్రంలో కొన్ని రోజులుగా వందలలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు 634
బెంగళూరు, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని రోజులుగా వందలలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్ మేరకు 634 పాజిటివ్ కేసులు నమోదు కాగా బెంగళూరులోనే 610 మంది ఉన్నారు. దక్షిణకన్నడలో 7, ఉడుపి, ఉత్తరకన్నడలో 3 చొప్పున, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, మైసూరులో 2 చొప్పున, బెళగావి, ధారవాడ, కలబురగి, శివమొగ్గ, తుమకూరులో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 503 మంది కోలుకోగా గడిచిన 24 గంటల్లో బెంగళూరులో ఒకరు, దక్షిణకన్నడలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 4500 యాక్టివ్కేసులకుగాను బెంగళూరులో 4,346 ఉన్నాయి.