ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-09-21T23:04:00+05:30 IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు చేరాయి. ఆదివారం ఉదయం నుంచి

ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏపీలో 6,31,749కి కరోనా కేసులు చేరాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కరోనాతో 51 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 5,410 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 74,518 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 5,51,821 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 51.60 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. 


కొత్తగా కృష్ణా 9, చిత్తూరు 7, విశాఖ 6, అనంతపురంలో ఐదుగురు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు 3, కడప 2, ప్రకాశం 2, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,262, పశ్చిమగోదావరి జిల్లాలో 962, ప్రకాశం 841 కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-21T23:04:00+05:30 IST