తగ్గుతున్న వైరస్.. జనగామ జిల్లాలో 62 మంది కరోనా బాధితుల డిశ్చార్జి
ABN , First Publish Date - 2020-07-03T17:14:27+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతోంది. కోవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది గురువారం డిశ్చార్జి అయినట్లు
22 మంది హోం ఐసోలేషన్లో చికిత్స
జనగామ (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతోంది. కోవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మంది గురువారం డిశ్చార్జి అయినట్లు జనగామ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 85 మంది కరోనా బారినపడగా, ఒకరు మృతి చెందినట్లు వ్లెడించారు. ఇప్పటి వరకు మొత్తం 62 మంది డిశ్చార్జికాగా, 22 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. జిల్లాలో కరోనావ్యాప్తి తగ్గిపోయిందని, ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని ఆయన కోరారు.