ఒక్కరోజే 616 కేసులు..

ABN , First Publish Date - 2020-10-20T06:45:17+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సోమవారం 616 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల

ఒక్కరోజే 616 కేసులు..

ఏలూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సోమవారం 616 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 87,046కి చేరింది. కొంతకాలంగా తక్కువ కేసులు నమోద వుతున్న ఏలూరులో మళ్లీ విజృంభించింది. ఇక్కడ 52 కేసు లు రాగా చింతలపూడిలో 48, తాడేపల్లిగూడెం 47, నరసా పురం 38, భీమవరంలో 32 ఎక్కువగా కేసులు నమోద య్యాయి.


చింతలపూడిలో నాలుగు రోజులుగా కేసుల సం ఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జంగారెడ్డిగూడెం 28, పాలకొల్లు 26, ఆచంట 26, యలమంచిలి 23, తణుకు 18, పెంటపాడు 18, పెనుగొండ 14, అత్తిలి 14, దెందులూరు 14, పెనుమంట్ర 13, పోడూరు 12, ఉంగుటూరు 12, చాగ ల్లులో 12 చొప్పున కేసులు వెలుగుచూశాయి. సోమవారం కరోనాతో ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 482కి చేరింది.


Updated Date - 2020-10-20T06:45:17+05:30 IST