రాష్ట్రంలో కొత్తగా 6,151 కేసులు

ABN , First Publish Date - 2021-06-18T08:15:24+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 6,151 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ మేరకు కేసులు బయటపడినట్టు వ్యైఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది

రాష్ట్రంలో కొత్తగా 6,151 కేసులు

మరో 58 మంది మృతి


అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 6,151 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,02,712 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ మేరకు కేసులు బయటపడినట్టు వ్యైఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. కరోనాతో మరో 58 మంది మృతి చెందినట్టు వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 18,32,902కి, మొత్తం మరణాల సంఖ్య 12,167కి పెరిగింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,244 మందికి వైరస్‌ సోకింది. ఒకరోజు వ్యవధిలో 7,728 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం రికవరీల సంఖ్య  17,50,904కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,831 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మరణించారు. 

Updated Date - 2021-06-18T08:15:24+05:30 IST