లోక్ అదాలత్లో 614 కేసులు పరిష్కారం
ABN , First Publish Date - 2022-08-14T05:16:55+05:30 IST
జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 614 కేసులను పరిష్కరించారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 13: జిల్లాకేంద్రంలోని కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 614 కేసులను పరిష్కరించారు. వాటిల్లో కార్మికులకు సంబంధించి 42, ఎస్పీసీ 409, ఐపీసీ 30, క్రిమినల్ 30, సివిల్ 19తో పాటు ఇతరత్రా కేసులు ఉన్నాయి. ఈ సందర్భంగా రెండో అదనపు జిల్లా జడ్జి రాజగోపాలరావు మాట్లాడుతూ .. మండల న్యాయ సేవా సంస్థ ద్వారా సత్వర న్యాయ సలహలు పొందొచ్చన్నారు. రాజీమార్గం ద్వారా కక్షిదారులు కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సీనియర్ సివిల్ జడ్జి జి.యజ్ఞనారాయణ, ఫస్టుక్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ డి.సౌజన్య తదితరులు పాల్గొన్నారు.