ఏపీలో కొత్తగా 6,113 కరోనా పాజిటివ్‌ కేసులు..48 మరణాలు

ABN , First Publish Date - 2020-09-30T23:52:06+05:30 IST

మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,113 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన

ఏపీలో కొత్తగా 6,113 కరోనా పాజిటివ్‌ కేసులు..48 మరణాలు

అమరావతి: మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 6,113 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93, 484కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 48 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5,828కు కరోనా మరణాలు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 58,445 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని 62, 9211 మంది డిశ్చార్జ్ అయ్యారు.


గడిచిన 24 గంటల్లో వివిధ జిల్లాల్లో నమోదయిన మరణాలు.. కొత్తగా చిత్తూరు 8, ప్రకాశం 6 , తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖలో ఐదుగురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కడపలో 3, కర్నూలు 2, నెల్లూరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

Updated Date - 2020-09-30T23:52:06+05:30 IST