మరో 6 కొవిడ్‌ అంబులెన్సులు

ABN , First Publish Date - 2020-09-25T08:50:27+05:30 IST

‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మంచిర్యాల ఎమ్యెల్యే దివాకర్‌ రావు అందజేసిన కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు...

మరో 6 కొవిడ్‌ అంబులెన్సులు

  • ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కింద అందించిన నేతలు 
  • ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మంచిర్యాల ఎమ్యెల్యే దివాకర్‌ రావు అందజేసిన కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను మంత్రి కేటీఆర్‌ గురువారం ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మూడు, బాల్క సుమన్‌ రెండు, దివాకర్‌రావు ఒక అంబులెన్సును ఇచ్చారు. కొవిడ్‌ సహాయక చర్యల కోసం వాటిని ప్రభుత్వానికి అందజేసినందుకు మంత్రి కేటీఆర్‌ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలోని కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణలో ఈ అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మంత్రి ఇంద్రకరణ్‌ అన్నారు.

Updated Date - 2020-09-25T08:50:27+05:30 IST