UP Encounter: ‌ఆరుగురు గోవధ నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-06-22T23:51:07+05:30 IST

అక్రమంగా గోవధకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను ఉత్తప్రదేశ్‌లోని..

UP Encounter: ‌ఆరుగురు గోవధ నిందితుల అరెస్టు

షహరాన్‌పూర్: అక్రమంగా గోవధ (Cow slaughter)కు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను ఉత్తప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్న తర్వాతనే ఈ అరెస్టులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. పశు కళేబరాలని, అందుకు ఉపయోగించిన పరికరాలను, ఒక నాటుతుపాకిని, కొన్ని తూటాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.


మంగళవారం రాత్రి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను అక్రమ్, సెహజాద్, ఇమ్రాన్, అక్బర్, ఇస్రార్, అర్షద్‌లుగా గుర్తించారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు.  ''ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసు టీమ్ దేవ్‌బండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిపై దాడులు జరిపింది. పశువధతో ప్రమేయం ఉన్న ఎనిమిది మంది వ్యక్తులను గుర్తించాం. ఇద్దరు తప్పించుకున్నారు. ఆరుగురుని అరెస్టు చేశాం'' అని షహరాన్‌పూర్ ఎస్‌పీ రాజేష్ కుమార్ తెలిపారు. యూపీలో గోవధ నిషేధ చట్టం అమలులో ఉంది.

Updated Date - 2022-06-22T23:51:07+05:30 IST