సౌతాంప్టన్ను వీడని వర్షం.. ఐదో రోజు ఇంకా మొదలు కాని ఆట
ABN , First Publish Date - 2021-06-22T20:57:03+05:30 IST
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐదో రోజు
సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ ఐదో రోజు ఆటకూ వరుణుడు అడ్డుతగిలాడు. నిన్న నాలుగో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా నేడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం పడుతూ తగ్గుతూ ఉండడంతో పిచ్పై కవర్లను కప్పి ఉంచారు. ప్రస్తుతం చిరు జల్లులు పడుతున్నాయి. త్వరలోనే అవి కూడా తగ్గే అవకాశం ఉండడంతో మ్యాచ్ ప్రారంభం అవుతుందనే భావిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం అవుతుందన్న ఉద్దేశంతో ఇరు జట్ల ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. కాగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకు ఆలౌట్ కాగా న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. విలియమ్సన్ (12), రాస్ టేలర్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.