మరో అయిదుగురికి బ్లాక్‌ ఫంగస్‌

ABN , First Publish Date - 2021-06-23T07:04:50+05:30 IST

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది.

మరో అయిదుగురికి బ్లాక్‌ ఫంగస్‌

ఒకరు మృతి
జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 22:  జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మంగళవారం మరో అయిదు కేసులు నమోదయ్యాయి. దాంతో కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్‌ ఫంగస్‌బారినపడి చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 149కు చేరింది. దీంతో ఇప్పటివరకు బ్లాక్‌ ఫంగస్‌తో జీజీహెచ్‌లో చేరిన బాధితుల సంఖ్య 260కు చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న 9 మంది డిశ్చార్జికాగా, మొత్తంగా 98 మంది ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జి చేయడం జరిగిందని జీజీ హెచ్‌ సూపరింటెండెంట్‌ డా క్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. 90 మందికి ఇప్పటి వరకు శస్త్రచికిత్సలు చేశామన్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఒకరు మృతి చెందారని, దాంతో మృతుల సంఖ్య 28కు చేరిందన్నారు.


Updated Date - 2021-06-23T07:04:50+05:30 IST