594 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-15T17:18:22+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్ మేరకు 594 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 582 మంది,
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించిన బులెటిన్ మేరకు 594 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 582 మంది, దక్షిణకన్నడలో 4, బళ్లారి 2, బెళగావి, బెంగళూరు రూరల్, కొప్పళ, శివమొగ్గ, ఉడుపి, ఉత్తరకన్నడలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 400 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 3882 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 3738 మంది ఉన్నారు.