59 వార్డుల్లో డిపాజిట్‌ దక్కని అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2022-02-25T15:40:22+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు దక్క లేదు. జీసీసీ పరిధిలో 200 వార్డులుండగా 50 వార్డుల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కకపోగా,

59 వార్డుల్లో డిపాజిట్‌ దక్కని అన్నాడీఎంకే

పెరంబూర్‌(చెన్నై): మున్సిపల్‌ ఎన్నికల్లో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పరిధిలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే అభ్యర్థులకు డిపాజిట్లు దక్క లేదు. జీసీసీ పరిధిలో 200 వార్డులుండగా 50 వార్డుల్లో ఆ పార్టీకి డిపాజిట్లు దక్కకపోగా, మరో 111 వార్డుల్లో 20 శాతంలోపు ఓట్లు కూడా పడలేదు.  10 వార్డుల్లో ఓట్ల శాతం ఏకసంఖ్యలో ఉండడం ఆ పార్టీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. అన్నాడీఎంకే డిపాజిట్లు కోల్పోయిన పలు స్థానాల్లో బీజేపీ, పీఎంకే రెండో స్థానంలో నిలిచాయి. ఉదాహరణకు మాత్తూర్‌ 19వ వార్డులో అన్నాడీఎంకే అభ్యర్థికి 9.5 శాతం ఓట్లు దక్కగా, బీజేపీ అభ్యర్థికి 19 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఎన్నికల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు చవి చూడని పార్టీ కార్యకర్తల ప్రస్తుత ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated Date - 2022-02-25T15:40:22+05:30 IST