తమిళనాడు పుజప్పుర సెంట్రల్ జైల్‌లో 59 మందికి కరోనా..!

ABN , First Publish Date - 2020-08-13T04:25:35+05:30 IST

తమిళనాడులోని పుజప్పుర సెంట్రల్ జైల్లోని 59 మంది ఖైదీలు కరోనా బారినపడ్డట్టు తాజాగా వెల్లడైంది.

తమిళనాడు పుజప్పుర సెంట్రల్ జైల్‌లో 59 మందికి కరోనా..!

త్రివేండ్రమ్: తమిళనాడులోని పుజప్పుర సెంట్రల్ జైల్లోని 59 మంది ఖైదీలు కరోనా బారినపడ్డట్టు తాజాగా వెల్లడైంది. దీంతో అధికారులు కరోనాను ఎలా అదుపు చేయాలో తెలీని స్థితిలో పడిపోయారు. మొత్తం 97 మందికి కరోనా యాంటీజెన్ పరీక్షలు నిర్వహించగా..59 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. ఆగస్టు పదిన ఓ ఖైదీ వైరస్ బారిన పడ్డాడని తెలియడంతో జైలు అధికారులు ఖైదీలకు విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కొంత మంది ఖైదీలు కరోనా కాటుకు గురైనట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఆ జైల్లో మొత్తం 1100 మంది ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, జైలు ఆడిటోరియంను క్వారంటైన్ కేంద్రంగా మారుస్తామని జైలు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా అనేక జైళ్లలో పదుల సంఖ్యలో ఖైదీలు కరోనా బారినపడుతుండటం అధికారులకు పెను సవాలుగా మారింది.

Updated Date - 2020-08-13T04:25:35+05:30 IST