పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు పెట్టిన 58 ఏళ్ల మహిళ.. ఆమె చెప్పింది విని పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2022-02-15T22:12:10+05:30 IST

ఆమె వయసు 58 సంవత్సరాలు.. సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త సోదరుడిపై అత్యాచారం కేసు పెట్టింది..

పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు పెట్టిన 58 ఏళ్ల మహిళ.. ఆమె చెప్పింది విని పోలీసులు షాక్!

ఆమె వయసు 58 సంవత్సరాలు.. సోమవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త సోదరుడిపై అత్యాచారం కేసు పెట్టింది.. అయితే ఆ ఘటన జరిగింది ఇప్పుడు కాదు.. 28 ఏళ్ల క్రితం. అప్పటి ఘటనపై కేసు పెట్టేందుకు మహిళ రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఈ ఘటన జరిగింది. 


నాగౌర్‌కు సమీపంలోని గోటాన్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం వెళ్లిన 58 ఏళ్ల మహిళ అక్కడి పోలీసులకు షాకిచ్చింది. తనకు 1990లో వివాహం జరిగిందని, తన భర్త ప్రభుత్వోద్యోగి కావడంతో తరచుగా వేరే ప్రాంతాలకు వెళ్లేవాడని చెప్పింది. 1994 జూలైలో తను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తన భర్త సోదరుడు ఇంట్లోకి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అంతేకాకుండా ఓ కెమేరా తీసుకొచ్చి తను నగ్నంగా ఉన్నప్పుడు ఫొటో కూడా తీశాడని ఫిర్యాదు చేసింది. 


అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ ప్రారంభించారు. అయితే రెండు కుటుంబాల మధ్య ఆస్థి తగాదాల వల్లే బావగారిపై ఆ మహిళ ఫిర్యాదు చేసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-02-15T22:12:10+05:30 IST