ఇరు జిల్లాల్లో 579 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-06-17T05:45:33+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధ వారం 579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,277 మందికి పరీక్షలు నిర్వహించగా 325 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు.

ఇరు జిల్లాల్లో 579 మందికి కరోనా

బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరు మృతి 

ఖమ్మం/కొత్తగూడెం నెట్‌వర్క్‌, జూన్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధ వారం 579 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,277 మందికి పరీక్షలు నిర్వహించగా 325 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో 165 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ నలుగురు మృత్యువాత పడ్డారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 8,039మందికి పరీక్షలు నిర్వహించగా 254 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో 4,110 మంది బుధవారం వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. జూలూరుపాడు మండలం గాంధీనగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (50) బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందాడు. 


Updated Date - 2021-06-17T05:45:33+05:30 IST