ఏడు రోజుల్లో రూ.55.08లక్షల హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2022-05-18T05:46:57+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏడు రోజుల్లో రూ.55.08లక్షల ఆదాయం సమకూరింది. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది మంగళవారం ప్రధాన కార్యాలయంలో లెక్కించారు.

ఏడు రోజుల్లో రూ.55.08లక్షల హుండీ ఆదాయం
ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

యాదగిరిగుట్టలో కానుకల లెక్కింపు


యాదగిరిగుట్ట, మే 17: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఏడు రోజుల్లో రూ.55.08లక్షల ఆదాయం సమకూరింది. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను దేవస్థాన సిబ్బంది మంగళవారం ప్రధాన కార్యాలయంలో లెక్కించారు. లెక్కింపుల అనంతరం నగదు రూ.55,09,088, మిశ్రమ బంగారం 134 గ్రా ములు, మిశ్రమ వెండి 1.150 కిలోలు ఆలయ ఖజానాకు జమచేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. విదేశీ భక్తులు 109 అమెరికా డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు, ఐదు కెనడా డాలర్లు, ఐదు సింగపూర్‌ డాలర్లు, ఒక రియాల్‌(సౌదీఅరేబియా)ను కానుకలుగా సమర్పించారు.

Updated Date - 2022-05-18T05:46:57+05:30 IST