మరో 550 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-04-17T05:32:40+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది
- ఇరువురి మృతి
కర్నూలు(హాస్పిటల్), ఏప్రిల్ 16: జిల్లాలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 550 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 64,889కు చేరింది. జిల్లాలోని వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,729 మంది చికిత్స పొందుతున్నారు. 61,653 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా, మృతుల సంఖ్య 507కు చేరింది.