55 ఏళ్లు దాటిన పోలీసులు స్టేషన్లోనే
ABN , First Publish Date - 2020-03-31T09:23:53+05:30 IST
పోలీసు శాఖలో 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను లాక్డౌన్ విధులకు దూరంగా ఉంచినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వారిని కార్యాలయాలు, స్టేషన్లలో విధులకు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు.
విజయవాడ, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులను లాక్డౌన్ విధులకు దూరంగా ఉంచినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. వారిని కార్యాలయాలు, స్టేషన్లలో విధులకు మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. విజయవాడలో లాక్డౌన్ అమలు తీరును సోమవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రాణీగారితోట, రైల్వేస్టేషన్, కాళేశ్వరరావు మార్కెట్, బెంజ్సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.