అదే జోరు..మరో 55 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-05T10:53:04+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి
1335 చేరిన బాధితులు
మరో 10 మంది డిశ్చార్జి
(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి ఆగడం లేదు. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం 55 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది,. కడప నగరంలో మరాటివీధి, హబీబుల్లావీధి, చిన్నబెస్తవీధి, దండు, అరవిందనగర్, ట్రంకు రోడ్డు, ఆకులవీధి, చిన్నచౌకు, టూటౌన్ ఏరియా, వాటర్గండి, సియోనుపురం, మారుతీనగర్లలో 21 కేసులు నమోదయ్యాయి. ప్రొద్దుటూరులో 11, కలసపాడు మండలంలో 5, పోరుమామిళ్లలో 5, పులివెందుల 5, టిసుండుపల్లె 2, తొండూరు 2, బికోడూరు, వల్లూరు, బద్వేలు, రాయచోటిలో ఒక్కో కేసు నమోదైంది. జిల్లాలో మొత్తం 1335కి పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.
మరో 10 మంది డిశ్చార్జి
కోవిడ్-19 నుంచి సంపూర్ణంగా కోలుకున్న పది మందిని జిల్లా కోవిడ్-19 నుంచి శనివారం డిశ్చార్జి చేసినట్లు కలెక్టరు హరికిరణ్ తెలిపారు. ఇప్పటి వరకు 470 మంది డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు.
కోవిడ్-19 సమాచారం
మొత్తం శాంపిల్స్ - 76882
రిజల్ట్ వచ్చినవి - 72858
నెగటివ్ - 71523
పాజిటివ్ - 1335
డిశ్చార్జ్ అయినవారు - 470
రిజల్ట్ రావాల్సినవి - 4024
జూలై 4వ తేదీ తీసిన శాంపిల్స్ - 1562