545 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-09-25T11:19:35+05:30 IST
జిల్లాలో 24 గంటల వ్యవధిలో 545 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది.
ముగ్గురి మృతి
కడప, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో 545 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 41,669కి చేరింది. మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య 425కి చేరింది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 311 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 37,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. హోం ఐసోలేషన్లో 2520 మంది చికిత్స పొందుతున్నారు. 3,77,617 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.