539 ఆలయాల్లో పారిశుధ్య పనులు ప్రారంభం
ABN , First Publish Date - 2021-08-04T12:43:40+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 539 పెద్ద ఆలయాల్లో చేపట్టిన పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు ప్రారంభించిన ఈ
ప్యారీస్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 539 పెద్ద ఆలయాల్లో చేపట్టిన పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సోమవారం హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు ప్రారంభించిన ఈ పనులు రెండో రోజైన మంగళ వారం కూడా జరిగాయి. ఆలయ అధికారులు, సిబ్బంది, వేలాది మంది ఆలయ ప్రాంగణాలు, మండపాలు, స్తంభాలను నీటితో శుభ్రం చేస్తున్నారు. రాజధాని నగరంలో ఉన్న 52 ఆలయాల్లో చెత్తా చెదారం భారీగా పేరుకుపోయింది. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ కుమరగురుపరన్ ఉత్తర్వులు మేరకు, కాంట్రాక్ట్ పద్ధతిన ఆలయాల్లో పారిశుధ్య పనులు జరుగుతున్నాయి. మైలాపూర్ కపాలీశ్వర ఆలయం, ట్రిప్లికేన్ పార్ధసారధి స్వామి ఆలయం, తిరువొత్తియూర్ త్యాగ రాజస్వామి ఆలయం, తిరువాన్మియూర్ మరుందీశ్వర ఆలయం, తిరు వేర్కాడు దేవికరుమారి అమ్మన్ ఆలయం, దిండుగల్ జిల్లా పళని దండాయుధపాణి ఆలయం, తిరుచ్చి జిల్లా సమయపురం మారియమ్మన్ ఆలయం, శ్రీరంగం, మదురె అమ్మవారి ఆలయం, తిరునల్వేలి నెల్లయప్పర్ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, రామేశ్వరం ఆలయం, తిరుత్తణి మురుగన్, తిరుచెందూర్ సుబ్రమణ్యస్వామి ఆలయం సహా 539 ఆలయాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.