నాబార్డు రుణ చెల్లింపు కోసం 52.97 కోట్లు
ABN , First Publish Date - 2020-09-25T09:30:32+05:30 IST
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని చెల్లించడానికి ప్రభుత్వం రూ.52.97 కోట్లను విడుదల చేసింది...
హైదరాబాద్, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నాబార్డు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని చెల్లించడానికి ప్రభుత్వం రూ.52.97 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఉత్తర్వులను జారీ చేశారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ఐడీఎఫ్ కింద నాబార్డు నుంచి రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి సంబంధించి ఈ ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో చెల్లించాల్సిన వడ్డీని విడుదల చేశారు.