సిద్దిపేట జిల్లాలో 52మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-07T07:06:03+05:30 IST
సిద్దిపేట జిల్లాలో గురువారం 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో 24 మందికి పాజిటివ్గా
సిద్దిపేట, ఆగస్టు 6: సిద్దిపేట జిల్లాలో గురువారం 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో 24 మందికి పాజిటివ్గా వచ్చింది. గజ్వేల్లో 9, హుస్నాబాద్లో 7, రాయపోల్లో 6, అక్కన్నపేటలో 2, బెజ్జంకిలో 1, దుబ్బాకలో 1, తొగుటలో 1, వర్గల్లో 1 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాంసాగర్లో ఆరు పాజిటివ్ కేసులు
రాయపోల్: రాయపోల్ మండలం రాంసాగర్లో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆ గ్రామంలో కరోనా కేసులు తొమ్మిదికి చేరుకున్నాయి. ఇటీవల ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా వైద్య సిబ్బంది గ్రామంలో సర్వే నిర్వహించి 20 మంది అనుమానితులను గుర్తించారు. వారందరికీ గురువారం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయగా ఆరుగురికి పాజిటివ్గా తేలింది.
హుస్నాబాద్లో ఐదుగురికి..
హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలో గురువారం ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి సౌమ్య తెలిపారు. పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో ముగ్గురికి, గణే్షనగర్లో ఒకరికి, మెయిన్రోడ్డులో మరొకరికి కరోనా వ్యాధి సోకినట్లు వైద్యాధికారి తెలిపారు.