బాన్సువాడలో 51 కరోనా కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-04-19T04:13:14+05:30 IST

బాన్సువాడ ఏరియాస్పత్రి పరిధిలో ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 51 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు.

బాన్సువాడలో 51 కరోనా కేసుల నమోదు

బాన్సువాడ టౌన్‌, ఏప్రిల్‌ 18 : బాన్సువాడ ఏరియాస్పత్రి పరిధిలో ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 51 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు. వీరిలో 17 మంది బాన్సువాడ పట్టణానికి చెందిన వారు కాగా, 34 మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. ప్రజలు మాస్క్‌ తప్పని సరిగా ధరించాలని, కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

బీర్కూర్‌లో 17 

బీర్కూర్‌, ఏప్రిల్‌ 18 : బీర్కూర్‌ పీహెచ్‌సీ పరిధిలో ఆదివారం 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. వీరాపూర్‌లో 2, దుర్కిలో 4, అన్నారంలో 3, నస్రుల్లాబాద్‌లో 2, చించొల్లిలో 4, వర్నిలో 2 చొప్పున కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారి తెలిపారు. 

పెద్ద కొడప్‌గల్‌లో రెండు

పెద్ద కొడప్‌గల్‌, ఏప్రిల్‌ 18 : పెద్ద కొడప్‌గల్‌ మండలంలో ఆదివారం 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, పెద్ద కొడప్‌గల్‌లో 1, కాటెపల్లిలో 1 చొప్పున రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.  


Updated Date - 2021-04-19T04:13:14+05:30 IST