50 ఏళ్ల వయసులో 12వ తరగతి పాసైన బామ్మ!

ABN , First Publish Date - 2020-07-16T03:35:21+05:30 IST

లెక్కలంటే వణుకుపుట్టి చదువు మానేసిన ఓ అమ్మాయి.. 32ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టింది.

50 ఏళ్ల వయసులో 12వ తరగతి పాసైన బామ్మ!

షిల్లాంగ్: లెక్కలంటే వణుకుపుట్టి చదువు మానేసిన ఓ అమ్మాయి.. 32ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టింది. ఇటీవల జరిగిన 12వ తరగతి పరీక్షలు రాసి పాసైంది. ఈ వింత మేఘాలయలో జరిగింది. ఇక్కడి ఓ గ్రామానికి చెందిన లాకింట్యూ  సిమ్లే అనే 50ఏళ్ల బామ్మ 12వ తరగతి పరీక్ష పాసైంది. 1988లో పదో తరగతి చదువుతూ గణితశాస్త్రం అంటే భయంతో చదువు మానేసిన ఆమె.. మళ్లీ 32 ఏళ్ల తరువాత పుస్తకాలు చేతపట్టింది. ‘2008లో ప్రి-స్కూల్ పిల్లలకు చదువుచెప్పే అవకాశం వచ్చింది. అప్పుడే చదువుతో ప్రేమలో పడ్డా’ అని సిమ్లే చెప్పింది. ఖాసీ భాషలో బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలని ఉన్నట్లు వెల్లడించింది.

Updated Date - 2020-07-16T03:35:21+05:30 IST