రోజుకు 500 మందికి మాత్రమే.. అమర్‌నాథ్ యాత్రకు అనుమతి!

ABN , First Publish Date - 2020-07-06T00:06:43+05:30 IST

ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు

రోజుకు 500 మందికి మాత్రమే.. అమర్‌నాథ్ యాత్రకు అనుమతి!

జమ్మూకశ్మీర్: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న భక్తుల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రోజుకు కేవలం 500 మంది భక్తులకు మాత్రమే ఆలయదర్శనం చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ యాత్రలు జూన్ 23 నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ కరోనా విలయతాండవం నేపథ్యంలో వీటిని వాయిదా వేశారు.

Updated Date - 2020-07-06T00:06:43+05:30 IST