కారులో మాస్కు వేసుకోనందుకు 500 జరిమానా
ABN , First Publish Date - 2020-09-19T07:44:59+05:30 IST
ఢిల్లీకి చెందిన న్యాయవాది సౌరభ్ శర్మ కారులో మాస్కు వేసుకోనందుకు పోలీసులు రూ. 500 జరిమానా విధించారు.
10లక్షలు పరిహారం ఇవ్యాలని కోర్టుకు న్యాయవాది
ఢిల్లీ, సెప్టెంబరు 18: ఢిల్లీకి చెందిన న్యాయవాది సౌరభ్ శర్మ కారులో మాస్కు వేసుకోనందుకు పోలీసులు రూ. 500 జరిమానా విధించారు. తాను ఒంటరిగానే కారులో వెళ్తున్నందున మాస్కు అవసరం లేదంటూ చెప్పేందుకు యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. దీంతో ఆయన జరిమానా చెల్లించారు.
తాజాగా ఆ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించనక్కరలేదు. చట్టవ్యతిరేకం గా పోలీసులు నాకు జరిమానా విధించారు. పరిహారంగా రూ. 10లక్షల్ని ఇచ్చేలా ఆదేశించాలని శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు.