300 మంది ఉండే జిల్లా జైలులో 68 మంది ఖైదీలకు కరోనా

ABN , First Publish Date - 2020-06-28T22:36:57+05:30 IST

మహారాష్ట్రలోని అకోలా జిల్లా జైలులో 50 మంది ఖైదీలు, మరో 28 మంది ఆదివారం కరోనా బారినపడినట్టు ఆరోగ్యశాఖ

300 మంది ఉండే జిల్లా జైలులో 68 మంది ఖైదీలకు కరోనా

అకోలా: మహారాష్ట్రలోని అకోలా జిల్లా జైలులో 50 మంది ఖైదీలు, మరో 28 మంది ఆదివారం కరోనా బారినపడినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జైలులో దాదాపు 300 మంది ఖైదీలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇటీవల ఈ జైలులోకి కొత్త వారిని తీసుకోలేదన్నారు. ఆదివారం జైలులోని 50 మంది పురుష ఖైదీలతోపాటు మరో 28 మందికి కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయినట్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తెలిపింది. తాజా కేసులతో కలుపుకుని జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,498 మందికి పెరిగింది. కాగా, ఈ నెల 24న జిల్లా జైలులో 18 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. కరోనా వైరస్ కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 76 మంది మరణించారు. ప్రస్తుతం జిల్లాలో 378 యాక్టివ్ కేసులు ఉండగా, 1000 మందికిపైగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  

Updated Date - 2020-06-28T22:36:57+05:30 IST