జగన్‌ పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించండి

ABN , First Publish Date - 2022-08-19T06:09:48+05:30 IST

టీడీపీ పాలనతోనే తమ బతుకులు మెరుగుపడతాయని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారని సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

జగన్‌ పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించండి
పార్టీలో చేరిన వారిని ఆహ్వానిస్తున్న బొండా ఉమామహేశ్వరరావు

జగన్‌ పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించండి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా

విద్యాధరపురం, ఆగస్టు 18: టీడీపీ పాలనతోనే తమ బతుకులు మెరుగుపడతాయని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారని సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో 63వ డివిజన్‌కు చెందిన 50 మంది టీడీపీలో చేరిన వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. కాటూరి శివ శంకర్‌రావు, సాయి కుమార్‌, హేమసాయి, కాంతారావు, చిన్నారావు, దుర్గారావు, రమణ, సుబ్రహ్మణ్యం, ఎల్లారావు తదితరులకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్‌ రెడ్డి అరాచక పాలనపై ప్రజల్లో చైతన్యం కలిగించి 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలన్నారు. జగన్‌ పాలనతో విసిగి పోయిన ప్రజలు టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, 63వ డివిజన్‌ అధ్యక్షుడు లబ్బా వెకుంఠరావు, ఇన్‌చార్జి కొండా, ఘంటా కృష్ణమోహన్‌, సెక్రటరీ కోట శ్రీను, తెలుగు మహిళ కార్యదర్శి లబ్బా దుర్గ, సీనియర్‌ నాయకులు బచ్చా, ఈడుపుగంటి కిషోర్‌, పెద్దశీను, మోత్కూరు కాశిం, షేక్‌ అన్వర్‌, జానీ, దుర్గాసి రాము పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T06:09:48+05:30 IST