50 ఎకరాల జీడి తోటలు దగ్ధం

ABN , First Publish Date - 2020-06-02T10:22:24+05:30 IST

మండలంలోని డొంకూరు సాగరతీరంలో గ్రామానికి చెందిన రైతుల జీడి తోటలు సోమవారం

50 ఎకరాల జీడి తోటలు దగ్ధం

కోటి రూపాయల నష్టంఫ లబోదిబోమంటున్న రైతులు


ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 1 : మండలంలోని డొంకూరు సాగరతీరంలో గ్రామానికి చెందిన రైతుల జీడి తోటలు సోమవారం దగ్ధమయ్యాయి. రైతుల కథనం మేరకు... డొంకూరుకు చెందిన బుడ్డ కాంతారావు, బుడ్డ భీమారావు, యర్ర సారధి, సూరాడ విశ్వనాఽథం,  పులకల జగ్గారావు, బత్తుల ఊర్వశి, బుడ్డ బాబూరావు, పైడిపిల్లి దూర్వాసులు, బైపిల్లి లచ్చయ్యలకు చెందిన సుమారు 50 ఎకరాల జీడితోటలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.


మంటలు అదుపు చేయడానికి అవకాశం లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగిందని వారంతా వాపోయారు. ఇందులో సగం వరకు జీడి పిక్కలు ఇంకా తీయ్యలేదు. దీంతో సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో కుదేలయ్యామని, ఈ ప్రమాదం వల్ల మరింతగా నష్టపోయామని వాపోయారు.ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-02T10:22:24+05:30 IST