తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల చిన్నారి సాహసం!

ABN , First Publish Date - 2020-05-25T22:24:08+05:30 IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా తల్లికి దూరమైన ఐదేళ్ల చిన్నారి సాహసం చేశాడు. ఢిల్లీ నుంచి

తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల చిన్నారి సాహసం!

బెంగళూరు: కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా తల్లికి దూరమైన ఐదేళ్ల చిన్నారి సాహసం చేశాడు. ఢిల్లీ నుంచి విమానంలో ఒంటరిగా బెంగళూరు చేరుకుని తల్లిని కలుసుకున్నాడు. బెంగళూరుకు చెందిన వివాన్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో ఉంటున్న తాతగారికి ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. నేడు దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఢిల్లీ నుంచి ఒక్కడే బయలుదేరిన వివాన్ శర్మ ఎట్టకేలకు బెంగళూరు చేరుకున్నాడు. విమానాశ్రయంలో తల్లి అతడిని రిసీవ్ చేసుకుంది. నేటి నుంచి విమాన సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వివాన్ తాతయ్య ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే మొదటి ఫ్లైట్‌కే టికెట్ బుక్ చేశారు. విమానమెక్కిన చిన్నారిని విమాన సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మూడు నెలల తర్వాత విమానాశ్రయంలో కుమారుడిని చూసిన ఆ తల్లి ఆనందానికి అంతే లేకుండా పోయింది.

Updated Date - 2020-05-25T22:24:08+05:30 IST