జిల్లాలో మరో 5 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-05-29T10:49:51+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు .
నెల్లూరు (వైద్యం) మే 28 : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం మరో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 3, సూళ్లూరుపేటలో రెండు కేసులు రికార్డుకెక్కాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 240కి చేరుకుంది.
ఉలిక్కిపడిన రాపూరు
రాపూరు, మే 28: మండలంలో చెన్నై లింకుతో తొలి కరోనా కేసు నమోదైంది. చెన్నైలోని ప్యారిస్లో ఉంటున్న నాయనపల్లికి భార్యతో కలసి వచ్చాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు