జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-06-06T20:34:33+05:30 IST

అమరావతి: సచివాలయంలో కరోనా కలకలం రేపింది. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా పాజిటివ్

అమరావతి: సచివాలయంలో కరోనా కలకలం రేపింది. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పొరుగు సేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి... ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి... పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి... సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు... సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు.. ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్దారణ అయ్యింది.


Updated Date - 2020-06-06T20:34:33+05:30 IST