యూపీలో ఘోర ప్రమాదం..
ABN , First Publish Date - 2021-01-27T01:12:34+05:30 IST
యూపీలో ఘోర ప్రమాదం..
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. అంబులెన్స్ ఓ ట్రక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భడోహి జిల్లాలో మంగళవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఐదుగురు మృతి చెందారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి అంబులెన్స్ రాజస్థాన్కు చెందిన చిత్తోర్గడ్కు వెళుతోంది. మరణించిన వారిలో అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా ట్రక్కును అంబులెన్స్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది.