జిల్లాలో ఐదుగురికి కరోనా
ABN , First Publish Date - 2020-12-06T05:25:08+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యల్ప స్థాయికి చేరింది. శనివారం 6,959 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు జిల్లాలో 60,287 మంది కరోనా బారిన పడ్డారు.
కర్నూలు(హాస్పిటల్), డిసెంబరు 5: జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అత్యల్ప స్థాయికి చేరింది. శనివారం 6,959 మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు జిల్లాలో 60,287 మంది కరోనా బారిన పడ్డారు. 122 యాక్టివ్ కేసులు కాగా 59,678 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.