చేవెళ్లకు 5 అంబులెన్సులు

ABN , First Publish Date - 2020-09-20T08:11:45+05:30 IST

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించుకునేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అయిదు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు.

చేవెళ్లకు 5 అంబులెన్సులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉపయోగించుకునేందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అయిదు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. బేగంపేటలోని ప్రగతి భవన్‌లో ఆ అంబులెన్సులకు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ శనివారం జెండా ఊపి ప్రారంభించారు.

కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా  ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమానికి పిలుపుఇచ్చారు. దానికి స్పందించిన రంజిత్‌ రెడ్డి తన పుట్టిన రోజు (శుక్రవారం) సందర్భంగా ఈ అంబులెన్సులను అందజేశారు. 


Updated Date - 2020-09-20T08:11:45+05:30 IST