490 కేసులు.. ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2021-06-20T05:13:55+05:30 IST

490 కేసులు.. ఐదుగురు మృతి

490 కేసులు.. ఐదుగురు మృతి
విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సహకారంతో జీజీహెచ్‌లో సుమారు రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను శనివారం ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. చిత్రంలో కలెక్టర్‌ నివాస్‌ కూడా ఉన్నారు.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా మహమ్మారికి శనివారం మరో ఐదుగురు బలైపోయారు. గడిచిన 24 గంటల్లో 7,278 మంది శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా, 490 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 44, విజయవాడ రూరల్‌ డివిజన్‌లో 154, నూజివీడు డివిజన్‌లో 167, మచిలీపట్నం డివిజన్‌లో 86, గుడివాడ డివిజన్‌లో 38 కేసులు ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 1,060కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 98,043కు చేరాయి. 91,894 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 5,089 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


Updated Date - 2021-06-20T05:13:55+05:30 IST