అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఏపీలో మొత్తం 20,65,716 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 14,367 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 4,837 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,46,512 మంది రికవరీ చెందారు.