ఖాళీలు భర్తీ చేయండి
ABN , First Publish Date - 2020-06-04T10:07:17+05:30 IST
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 4,560 పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ను ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్
- సీఎంకు వంశీచంద్ రెడ్డి లేఖ
హైదరాబాద్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 4,560 పోస్టులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ను ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఈ పోస్టులకు సంబంధించి టీఎ్సపీఎస్సీ 2017- 18లో నోటిఫికేషన్లు జారీ చేసి రాత పరీక్షలను కూడా నిర్వహించిందని, కానీ ఫలితాలు విడుదల చేయలేదని, నియామకాలు చేపట్టలేదని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఫలితాలను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.