దుకాణదారులపై రూ.45 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-05-27T09:52:36+05:30 IST

తూనికలు, కొలతల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా మంగళవారం నగరంతోపాటు హిందూపురం పరిధిలోని పలు ..

దుకాణదారులపై రూ.45 వేల జరిమానా

అనంతపురం క్రైం, మే 26: తూనికలు, కొలతల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా మంగళవారం నగరంతోపాటు హిందూపురం పరిధిలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు చేశారు. కిరాణా, హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలు, మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అధిక ధరలతోపాటు పలు లోపాలు గుర్తించారు. 13 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసి రూ.45 వేల జరిమానా విధించారు. తనిఖీల్లో  అధికారులు స్వామి, మహమ్మద్‌గౌస్‌, శ్రీనివాసరెడ్డి, వాసుప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-27T09:52:36+05:30 IST