441 మందికి కరోనా.. ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:13:08+05:30 IST
441 మందికి కరోనా.. ముగ్గురు మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 441 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు పాజిటివ్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55,743కు చేరింది. మరణాలు అధికారికంగా 713కు చేరాయి. ఇంకా 4,632 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారినపడిన మొత్తం బాధితుల్లో 50,398 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.
రేపటి నుంచి మచిలీపట్నంలో రాత్రి లాక్డౌన్
గురువారం నుంచి మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో రాత్రి లాక్డౌన్ విధిస్తూ రెవెన్యూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో గురువారం మొదలు రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి ఉండదని మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి మంగళవారం ప్రకటించారు.