ప్రకాశం జిల్లాలో మరో 44 మందికి కరోనా..

ABN , First Publish Date - 2020-07-14T12:26:41+05:30 IST

ప్రకాశం: జిల్లాలో మరో 44 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇప్పటి వరకూ జిల్లాలో 1705 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రకాశం జిల్లాలో మరో 44 మందికి కరోనా..

ప్రకాశం: జిల్లాలో మరో 44 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇప్పటి వరకూ జిల్లాలో 1705 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 27 మంది మృతి చెందారు. జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు లక్ష దాటాయి. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం పంపిన శ్యాంపిళ్లు 1,01,849 కాగా... నెగిటివ్ ఫలితాలు వచ్చినవి 91,679.. ఇంకా 8529 శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్నవారు 709 మంది కాగా... నిన్న కరోనా నుంచి కోలుకుని 114 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా బారి నుంచి కోలుకుని 1185 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం 520 యాక్టివ్ కేసులున్నాయి. 



Updated Date - 2020-07-14T12:26:41+05:30 IST