కేరళలో ఇవాళ కొత్తగా 435 కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-13T00:02:35+05:30 IST
కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో ఇవాళ కొత్తగా...
తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేరళలో ఇవాళ కొత్తగా 435 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో విదేశాల నుంచి వచ్చిన 128 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చిన 87 మందికి, కరోనా సోకిన వారి నుంచి మరో 206 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కేరళలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,743. కేరళలో ఆదివారం కరోనా వల్ల ఇద్దరు మరణించారు. ఇవాళ 132 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కేరళలో ఇప్పటివరకూ 4,097 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. కేరళలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా తిరువనంతపురంలో జూలై 6 నుంచి విధించిన ట్రిపుల్ లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించారు.