సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు 432 మంది ఎంపిక
ABN , First Publish Date - 2021-07-28T05:54:11+05:30 IST
జీఎంఆర్ రక్ష ఆధ్వర్యంలో మంగ ళవారం ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
నర్సీపట్నం, జూలై 27 : జీఎంఆర్ రక్ష ఆధ్వర్యంలో మంగ ళవారం ఇక్కడ నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్పీ మణికంఠ చందోలు పర్యవేక్షణలో సంస్థ మేనేజర్ హనుమంతు రావు ఆధ్వర్యంలో ఎంపిక పక్రియ జరిగింది. చుట్టు పక్కల మండలాల నుంచి 550 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 156 సెంటీమీటర్లు ఎత్తు, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మణికంఠ చందోలు విలేఖరులతో మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు 432 మంది ఎంపికైనట్టు తెలిపారు. వీరికి అనంతపురం జిల్లా హిందూపురంలో రక్ష అకాడమీలో నెల రోజుల పాటు శిక్షణ అనంతరం జీఎంఆర్ సంస్థకు సంబంధించిన కంపెనీల్లో ఉద్యోగావకా శాలు కల్పిస్తారని చెప్పారు.