తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 43 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-04-05T02:21:33+05:30 IST
తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిజాముద్దీన్ ఘటన అనంతరం పాజిటివ్ కేసుల పెరిగిపోతోంది. కాగా శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణలో 272కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. శనివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం మొత్తం 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా రాష్ట్రంలో మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.