పని మీద బయటకు వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి రాగానే 17 ఏళ్ల కూతురు ఏడుస్తూ చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-11-18T18:52:21+05:30 IST

అతనికి ఇంటి దగ్గరే కిరాణా దుకాణం ఉంది.. పది రోజుల క్రితం అతడు తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లాడు..

పని మీద బయటకు వెళ్లిన తల్లిదండ్రులు.. తిరిగి రాగానే 17 ఏళ్ల కూతురు ఏడుస్తూ చెప్పింది విని..

అతనికి ఇంటి దగ్గరే కిరాణా దుకాణం ఉంది.. పది రోజుల క్రితం అతడు తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లాడు.. అతడి ఇద్దరు కూతుళ్లు ఇంటి దగ్గరే దుకాణంలో ఉన్నారు.. ఆ సమయంలో ఎదురింట్లో ఉన్న 40 ఏళ్ల వ్యక్తి దుకాణానికి వచ్చాడు.. ఇంట్లో పెద్దవాళ్లు లేరని గ్రహించి బాలికను స్టోర్ రూమ్‌లో ఉన్న వస్తువు కోసం పంపించాడు.. ఆ బాలిక వెంటే తను కూడా వెళ్లి బలవంతంగా ముద్దు పెట్టేశాడు.. గుడి నుంచి ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 



రాజస్థాన్‌లోని పాలి ప్రాంతానికి చెందిన సందీప్ నెహ్రా అనే వ్యక్తి ఇంటి వద్దే కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన సందీప్ తన భార్యతో కలిసి సమీపంలోని ఆలయానికి వెళ్లాడు. ఇంట్లో పెద్దవాళ్లు లేరని గ్రహించిన పొరుగింటి జయంతీలాల్ మాలి అనే వ్యక్తి దుకాణానికి వెళ్లి కొన్ని వస్తువులు కావాలని అడిగాడు. వాటిని తెచ్చేందుకు 17 ఏళ్ల బాలిక స్టోర్ రూమ్‌లోకి వెళ్లింది. ఆ బాలికను అనుసరించిన జయంతీలాల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. 


తలిదండ్రులు తిరిగి వచ్చిన తర్వాత ఆ బాలిక విషయం మొత్తాన్ని చెప్పింది. దీంతో అందరూ కలిసి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జయంతీలాల్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద జయంతీలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-11-18T18:52:21+05:30 IST