ఆముదం ఆకులు తిని 40 గొర్రెల మృతి

ABN , First Publish Date - 2021-04-13T06:31:25+05:30 IST

మండలంలోని సీపీ ప్యాపిలి గ్రామంలో సోమవా రం ఆముదం ఆకులు తిని 40 గొర్రెలు మృతి చెందాయి.

ఆముదం ఆకులు తిని 40 గొర్రెల మృతి
మృతి చెందిన గొర్రెలు

వజ్రకరూరు, ఏప్రిల్‌ 12: మండలంలోని సీపీ ప్యాపిలి గ్రామంలో సోమవా రం ఆముదం ఆకులు తిని 40 గొర్రెలు  మృతి చెందాయి. బాధితులు పులలింగ ప్ప, పూలవిరుపన్న, రామాంజినేయులు నాయక్‌, హేమ్లానాయక్‌ తెలిపిన వివరా లివి. తమకున్న 700 గొర్రెలను పీసీ ప్యాపిలి తండా సమీపంలోని పొలాల్లోకి  మేత కోసం తీసుకెళ్లారు. ఈక్రమంలో గొర్రెలు ఆముదం ఆకులను తిన్నాయి. సాయంత్రం గూటికి చేరుకున్న గొర్రెలు జొల్లు కారుస్తూ కిందపడ్డాయి. వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందాయి. ఒక్కొక్క గొర్రె విలువ రూ.10 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత గొర్రెల కాపర్లు కోరారు.

Updated Date - 2021-04-13T06:31:25+05:30 IST